ఏపీ రైతులకు తీపికబురు.. మళ్లీ ఆ పథకం అమలు.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 24
ఏపీ రైతులకు శుభవార్త. టీడీపీ కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2014 హయాంలో అమలు చేసిన రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు పథకాన్ని మళ్లీ అమలు చేయాలని భావిస్తోంది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ త్వరలోనే ఏపీ రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు అందిస్తామని ప్రకటించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దీనిని పట్టించుకోలేదని.. కానీ తాము తిరిగి తెస్తామని అచ్చెన్న చెప్పారు.
Read Entire Article