AP Farmers Pattadar Passbooks Corrections: గత ప్రభుత్వ రీసర్వేలో తప్పులు దొర్లాయని, వాటిని సరిదిద్ది కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఉచితంగా అందిస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఒకవేళ ఇంకా తప్పులు ఉన్నా.. వాటిని కూడా సరిచేస్తామని తెలిపారు. 6,688 గ్రామాల్లో రీసర్వే సరిగ్గా జరగలేదని, 4,783 గ్రామాల్లో భూహక్కుపత్రాల్లో తప్పులున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 'రీ సర్వే 2.0'ను జాగ్రత్తగా చేపడుతోందని, రైతుల సమక్షంలోనే సర్వే జరుగుతోందని వివరించారు.