ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ధాన్యం అమ్మకాల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. అందులో భాగంగా వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక నంబర్ను కేటాయించిన ప్రభుత్వం.. దానికి 'Hi' అని పంపితే.. AI వాయిస్ ద్వారా సేవలను తెలియజేస్తుంది. అనంతరం ఆధార్, పేరు, కొనుగోలు కేంద్రం, తేదీ, సమయం, ధాన్యం రకం, బస్తాల సంఖ్య.. వంటి వివరాలు నమోదు చేస్తే స్లాట్ బుక్ అవుతుంది. ఇకపై రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. నిర్దిష్ట సమయానికి ధాన్యం అమ్ముకోవచ్చు.