ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రానికి వరుణ గండం ఇంకా వీడలేదని.. ఈ నెలలో మరి కొన్ని రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుందని.. దీని ప్రభావంతో.. రాష్ట్రంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలానే నేడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ వివరాలు..