ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం శుభవార్తను ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలకు దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాలని నిర్ణయించింది. ఒకటి నుండి 8వ తరగతి విద్యార్థుల వరకూ నెలకు రూ. 600 చొప్పున, మూడు నెలలకు ఒకసారి రూ. 1800 అందజేస్తారు. గతంలో ఏడాదికి ఒకసారి అందించే విధానంపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.