Ippala Ravindra Reddy in Nara Lokesh meeting: ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య, వృత్తివిద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ ఐటి సంస్థ సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 50వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధి అంశాల్లో సిస్కో ట్రైనింగ్ ఇవ్వనుంది. అయితే ఈ కార్యక్రమంలో గతంలో టీడీపీ నేతలపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన ఇప్పాలా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి హాజరుకావటంతో వివాదాస్పదమైంది.