ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందేలా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మనుషుల గురించే కాక మూగజీవుల సంక్షేమం కోసం కూడా చంద్రబాబు నాయుడు వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా పశువుల కోసం హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మాచర్లలో నిర్వహించిన స్వచ్ఛాంధ్రా కార్యక్రమంలో దీనిపై ప్రకటన చేశారు. ఆ వివరాలు..