ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పదవీకాలం మూడు నెలల పాటు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఈ మేరకు ఆమోదం తెలిపింది. దీంతో 2026 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ విజయానంద్ సీఎస్గా కొనసాగుతారు. ఆ తర్వాత తదుపరి సీఎస్గా జి. సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆయన సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.