Center Rs 1067 Crore For Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసింది. పట్టణాభివృద్ధి కోసం రూ.1,067 కోట్లు విడుదలయ్యాయి. నెల్లూరు-బద్వేలు కారిడార్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ పెరగడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని భావిస్తున్నారు. మరిన్ని నిధులు రానున్నాయని సమాచారం.