Nellore District Two New 100 Bed ESI Hospitals: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త చెప్పింది. నెల్లూరు జిల్లాలో 100 పడకల సామర్థ్యంతో రెండు ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు లోక్సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు. గత ఐదేళ్లలో ఏపీకి మూలధన వ్యయం కోసం రూ.19,287 కోట్లు వడ్డీలేని రుణాలు, రూ.2,60,644 కోట్లు కేంద్రం నుంచి అందినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి లోక్సభలో తెలిపారు.