రద్దీ సమయాల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 76 ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ కేంద్రాలను అభివృద్ధి చేయాలని తాజాగా నిర్ణయించింది. ఇప్పటికే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో విజయవంతమైన ప్రయోగాల తర్వాత, ఈ కేంద్రాలను 2026 సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కేంద్ర రైల్వే మంత్రి ఆదేశించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఈ కేంద్రాలు నిర్మించబడతాయి.