సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రూ.567 కోట్ల గ్రాంటు విడుదలైంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ.2,600 కోట్లలో ఇది చివరి విడత. ఈ నిధులతో రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాలు బలోపేతం అవుతాయని, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, రోగ నిర్ధారణ సేవలు మెరుగుపడతాయని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఇది రాష్ట్ర ఆరోగ్య రంగానికి ఎంతగానో మేలు చేస్తుందని తెలిపారు.