Guntur SCR Wagon Overhauling Center: దక్షిణ మధ్య రైల్వే శాఖ గుంటూరులో సరికొత్తగా అత్యాధునిక వ్యాగన్ల ఓవర్ హాలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా వ్యాగన్లకు కావాల్సిన మరమ్మతులు ఇక గుంటూరులోనే చేయవచ్చు. దీనికోసం రైల్వే శాఖ దాదాపు 72 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీనివల్ల గూడ్స్ రైళ్ల నిర్వహణ మరింత సులువు అవుతుంది. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే గూడ్స్ రైళ్ల నిర్వహణలో కొత్త శకం మొదలవుతుంది.