ఏపీకి మరో భారీ పెట్టుబడి కన్ఫర్మ్ అయింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది. గూగుల్ డేటా సెంటర్ను ఏకంగా రూ.52 వేల కోట్లకుపైగా పెట్టుబడితో పెట్టనున్నట్లు అధికారికంగా వెల్లడైంది. మరోవైపు.. హైటెక్ సిటీ తరహాలో మధురవాడలో డేటా సిటీని అభివృద్ధి చేయనున్నారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. విశాఖను ఐటీకి కేంద్రంగా మార్చాలని ప్రయత్నాలు చేస్తోంది.