Papikondalu Tour Cancel: భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటిమట్టం పెరగడంతో పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం నుంచి యాత్రను నిలిపివేస్తూ జలవనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం పెరగడం, దండంగి-డి.రావిలంక మధ్య రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముందుస్తు రిజర్వేషన్ చేసుకున్న పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత తదుపరి తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.