ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నరేంద్ర మోదీ పర్యటించారు. పర్యటనలో భాగంగా శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించనున్నారు ప్రధాని. అనంతరం కర్నూలుకు చేరుకుని రూ.13,400 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం కర్నూలులో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.