Andhra Pradesh Monsoon Entered: రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ను తాకడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని, జూన్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.