ఏపీలో సంక్రాంతి పండుగకు కోడి పందేలు ఓ రేంజులో జరుగుతాయనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా కోడి పందేలు భారీగా జరిగాయి. బరులలో కోళ్లు కత్తులు కట్టుకుని ఢీకొట్టాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి. బరుల వద్ద మద్యం, మాంసం అమ్మకాలు భారీగా జరిగాయి. అయితే కోడిపందేలలో ఓడిపోయిన కోళ్లకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇలాంటి కోడి పుంజుల మాంసం కిలో 1800 రూపాయల వరకూ పలుకుతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు.