Andhra Pradesh Anna Canteens Rs 1 Crore Donated: ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు నిర్వహిస్తోంది.. పలువురు దాతాలు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏపీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఫౌండర్ ఛైర్మన్ నార్నే రంగారావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి డా.శాంతారావు నార్నే రూ.1,00,01,116 విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.. కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభించాక నారా భువనేశ్వరి రూ.కోటి విరాళంగా అందజేసి తనకు స్ఫూర్తిగా నిలిచారని శాంతారావు అన్నారు.