Nara Lokesh Open Ashok Leyland Plant Mallavalli: ఏపీలో మరో పరిశ్రమ ఏర్పాటైంది. విజయవాడ సమీపంలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోఖ్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభమైంది. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభమైంది. సుమారుగా 75 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ఏర్పాటైంది. దీనిద్వారా ఏడాదికి 4800 బస్సులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు ఈ ప్లాంట్ ద్వారా 1800 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.