గుంటూరు వాసుల ఎదురుచూపులకు తెరపడింది. నందివెలుగు ఆర్వోబీ నిర్మాణ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టుకు 2014లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2018లో పనులు ప్రారంభమయ్యాయి. సగం పనులు పూర్తి అయిన తర్వాత ఆర్థిక సమస్యలతో ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయింది. అయితే స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో నందివెలుగు ఆర్వోబీ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.