Tenali Railway Station Rs 27 Crores Development: ఆంధ్రప్రదేశ్లోని తెనాలి రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేస్తోంది. రూ.27.70 కోట్లతో స్టేషన్లో కొత్త వంతెనలు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, వెయిటింగ్ హాల్స్ నిర్మిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో ప్లాట్ఫారమ్ను మెయిన్ లైన్గా మారుస్తున్నారు. త్వరలో ఆరో ప్లాట్ఫాం కూడా అందుబాటులోకి రానుంది. ఈ అభివృద్ధి పనులు మూడు నెలల్లో పూర్తి కానున్నాయి.