Chennai Narasapur Vande Bharat On Loop Line: ఏపీలో దేశంలోనే తొలిసారిగా వందేభారత్ ఎక్స్ప్రెస్ లూప్లైన్లో నడపడానికి అనుమతి లభించింది అన్నారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. జనవరి 12 నుంచి విజయవాడ-చెన్నై మధ్య నడిచే ఈ రైలు నరసాపురం వరకు నడుస్తుందన్నారు. గుడివాడ, భీమవరంలో కూడా ఈ రైలు ఆగుతుంది. ఈ కొత్త సేవలు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని శ్రీనివాసవర్మ తెలిపారు. భీమవరం, ఆకివీడు స్టేషన్లలో లిఫ్ట్లు ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని కూడా క్లారిటీ ఇచ్చారుు.