Ap Blind Students Mpc Bipc Admissions Allowed: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంధ విద్యార్థులకు శుభవార్త అందించింది. ఇకపై ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదవడానికి అవకాశం కల్పించింది. ప్రాక్టికల్స్లో బిట్ పేపర్ విధానం, సహాయకుడిని ఏర్పాటు చేసింది. దివ్యాంగ విద్యార్థులకు ఒక భాషా సబ్జెక్టు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఐదు సబ్జెక్టుల నిబంధనను పరిష్కరించడానికి సగటు మార్కులను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.