ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగరాలు/నాగరాలు సామాజికవర్గానికి బీసీ-డి కింద కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని నిర్ణయించింది. కొన్ని జిల్లాల్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నామని ఆ సామాజికవర్గం నేతలు మంత్రికి విజ్ఞప్తి చేశారు.