ఏపీలో క్రీడారంగం అభివృద్ధికి కేంద్రం తన వంతు సహకారం అందిస్తోంది. అందులో భాగంగా ఖేలో ఇండియా పథకం కింద వివిధ పనులకు ఇటీవల రూ.60 కోట్లు మంజూరు చేసింది. అందులో భాగంగా గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి కూడా నిధులు కేటాయించింది. బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే నజీర్ వెల్లడించారు.