ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆటో డ్రైవర్ల అకౌంట్లోకి శనివారం డబ్బులు జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్లు జమ చేశారు. అయితే ఆటో డ్రైవర్ల సేవలో పథకం అర్హత సాధించాలంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ లేకపోతే పథకం ప్రయోజనాలు వర్తించవు. ఈ నేపథ్యంలో అటో డ్రైవర్లకు అండగా ఉండేందుకు డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు సమయంలో సహాయం చేస్తామని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వెల్లడించారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఈ సాయం అందించనున్నారు.