విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా బిల్లు చెల్లింపులు, కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం సులభం కానుంది. అంతేకాకుండా.. ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఎంత కరెంటు ఉపయోగిస్తున్నాయో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే అధికారులతో నేరుగా సంప్రదించే అవకాశం ఈ యాప్ ద్వారా కల్పించారు. కాగా ఇటీవల, విద్యుత్ సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ అధికారులను హెచ్చరించారు.