ఏపీలో ఉగ్రకుట్ర వేళ వారిపై దృష్టి పెట్టండి.. సీఎస్, డీజీపీలకు పవన్ కళ్యాణ్ లేఖ

9 months ago 33
ఆంధ్రప్రదేశ్‌లో ఉగ్రవాద కదలికలపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర నిఘా అవసరమని.. మరీ ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్ ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విజయనగరంలో ఐసిస్‌తో సంబంధాలున్న వ్యక్తి అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Read Entire Article