AP Free Bus Scheme New Buses: రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్యను పెంచుతున్నామని ఆర్టీసీ జోన్-1 ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. 2028 నాటికి అన్ని డిపోలకు ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని.. ఉమ్మడి విజయనగరం జిల్లాకు 98 బస్సులు వస్తాయని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నామని, సిబ్బంది కొరతను అధిగమించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఈడీ బ్రహ్మానందరెడ్డి.