AP Free Bus Scheme New Buses In Guntur District: ఆంధ్రప్రదేశ్లో 'స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా మరో 40 పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు, 150 ఎలక్ట్రిక్ బస్సులు కావాలని ప్రతిపాదనలు పంపారు.