ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో 44 అంశాలకు ఆమోదం లభించింది. రూ. 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అమరావతిలో లోక్భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణం, గవర్నర్ కార్యాలయం, గెస్ట్ హౌస్ల నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇక రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు 26 సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. కొందరు మంత్రులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.