Andhra Pradesh High Temperatures And Heat Waves Alert: ఏపీలో ఎండలు, వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఫిబ్రవరి నెలలోనే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భానుడి భగభగతో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్రంలో ఏకంగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతేకాదు ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎండలు మాత్రమే కాదు ఉత్తరాంధ్రలో వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.