Andhra Pradesh Highest Gst In June: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల నమోదైంది. జూన్ నెలలో రూ.4,167.66 కోట్ల పన్నులు వసూలయ్యాయి. జీఎస్టీ ప్రారంభమైన తర్వాత ఒక నెలలో ఇంత పెద్ద మొత్తం వసూలు కావడం ఇదే తొలిసారి. వాణిజ్య పన్నుల శాఖ తీసుకున్న చర్యలు, ఏఐ వినియోగంతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పన్నుల శాఖ ఏఐని వినియోగిస్తోంది.