One Lakh Crore Investment In Visakhapatnam: 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం.. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ. 13.21 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ మేరకు వివిధ కంపెనీలతో 613 ఎంవోయూలు కుదుర్చుకుంది. అందులో విశాఖ కేంద్రంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రూ. లక్ష కోట్ల విలువగల 99 ఒప్పందాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చిన కంపెనీలు.. పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు భూములు సిద్ధం చేసి, విద్యుత్, నీటి సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.