Nara Lokesh Meet Student Unions: ఏపీలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. విద్యార్థి సంఘాల నేతలతో సమావేశమై, వారి సమస్యలను విన్న మంత్రి, వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని, విద్యాసంస్థల్లో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. అలాగే, ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థినులకు 'కలలకు రెక్కలు' పథకం అమలుపై కూడా చర్చించారు మంత్రి నారా లోకేష్. ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా మంత్రి లోకేష్ను కలిశారు.