ఏపీలో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయి.. ప్రజలకు ఇబ్బందులు కాకుండా చర్యలు చేపడుతున్నారు. వాతావరణ శాఖ మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికలతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. వరదలు పోటెత్తే ప్రాంతాల్లో ఇప్పటికే రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. ఇక కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.