ఏపీలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రెండు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతితో పాటుగా, శ్రీకాకుళం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సాంకేతిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారీ కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా శ్రీకాకుళం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు.