రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ఏపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం సహకారంతో రైల్వే లైన్లు, ఆర్వోబీలు, జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఏళ్లుగా మూలనపడిన ప్రాజెక్టులకు కూడా అనుమతులు తీసుకుంటూ తిరిగి పట్టాలెక్కిస్తోంది. ఈ క్రమంలోనే కడప రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులకు సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్టు మొదటి ప్యాకేజీ కింద కడప రాజంపేట రహదారి పనులను ప్రారంభించారు. ఆలస్యం కారణంగా కంపచెట్లు పెరిగిపోగా .. వాటిని తొలగించే పనులను చేపట్టారు.