2026-27 ఏడాదికి సంబంధించి ఏపీ సర్కార్ కొత్త ఎక్సైజ్ పాలసీని ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 3736 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నట్లు తెలిపింది. అయితే లాటరీ ద్వారా కేటాయించే దుకాణాలకు రూ.3 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజును నిర్ణయించింది. ఎంఆర్పీ కంటే అధిక ధరకు విక్రయించడం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, బ్రాండ్ మిక్సింగ్ వంటి ఉల్లంఘనలకు తొలి తప్పిదానికి రూ.10 లక్షల వరకు జరిమానా.. పునరావృతమైతే లైసెన్స్ రద్దు చేసే నిబంధనలు తీసుకొచ్చింది.