కేంద్ర ప్రభుత్వం సహకారంతో మౌలిక వసతులకు సంబంధించి ఏపీలోని పలు ప్రాజెక్టులలో వేగం పెరిగింది. జాతీయ రహదారులు, రైల్వేట్రాక్స్ నిర్మాణం వంటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కుప్పం- మారికుప్పం మధ్యన నిర్మిస్తున్న నూతన రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. రెండేళ్లలో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. మరోవైపు ఈ నూతన రైల్వేలైన్ అందుబాటులోకి వస్తే కుప్పం రైల్వే జంక్షన్గా మారుతుందని అధికారులు చెప్తున్నారు.