బెంగళూరు నుంచి ఏపీ రాజధాని అమరావతి, విజయవాడలకు ప్రయాణ సమయాన్ని 12-13 గంటల నుంచి 6-7 గంటలకు తగ్గించేలా నిర్మిస్తున్న కోడూరు-ముప్పవరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే పనులు వేగంగా సాగుతున్నాయి. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్లో భాగంగా రూ.14 వేల కోట్ల వ్యయంతో భారతమాల పరియోజన మొదటి దశ కింద ఈ ఆరు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. 342.24 కి.మీ. మేర సాగే ఈ గ్రీన్ఫీల్డ్ హైవే పనులను వచ్చే ఏడాది జూన్, జులై నాటికి పూర్తి చేసి వాహనాల రాకపోకలను ప్రారంభించాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.