Rajahmundry Ring Road: ఏపీలో మరో నగరానికి రింగ్ రోడ్డు రాబోతోంది. రాజమహేంద్రవరంలో త్వరలో రింగ్ రోడ్డు రానుందని మంత్రి నారాయణ తెలిపారు. అంతేకాదు పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు కూడా మొదలుపెట్టారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు మరో రూ.7 వేలు విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పుల భారం మోపిందని, పెట్టుబడుల కోసం మంత్రులు విదేశాలకు వెళ్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, పరిశ్రమల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన చెప్పారు.