Andhra Pradesh New 70 Anna Canteens: పేదల ఆకలి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను విస్తరిస్తోంది. ప్రస్తుతం 113 నియోజకవర్గాల్లో ఉన్న ఈ క్యాంటీన్లను, మరో 70 కొత్త క్యాంటీన్లతో కలిపి జనవరిలో 205కు పెంచనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనుండగా, ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి రూ.61 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 1,84,500 మంది రూ.5కే భోజనం చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.45.07 కోట్లకు పైగా అదనపు భారం పడుతోంది.