New Lv Prasad Eye Hospital In Gudlavalleru: ఏపీలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రులు వరుసగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆస్పత్రులు ప్రారంభంకాగా.. తాజాగా మరో ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లాలో ప్రజలు తక్కువ ఖర్చుతో ఆస్పత్రిలో వైద్య సేవలు పొందొచ్చు. ఇకపై కంటి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పనిలేదు.