Cargo Airport Palasa: శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్గో విమానాశ్రయం నిర్మాణంపై అపోహలు వీడాలని ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు సూచించారు. రైతుల అంగీకారంతోనే భూసేకరణ జరుగుతోందని, రెట్టింపు పరిహారం, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 1383 ఎకరాల భూమి అవసరం కాగా, భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఇది జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు పలాస కార్గో ఎయిర్పోర్ట్ భూసేకరణ దిశగా అడుగులు పడుతున్నాయి.