Krishna Canal Guntur Third Railway Line: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే సౌకర్యం మరింత మెరుగుకానుంది. విజయవాడ-గుంటూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలపనుంది. దాదాపు రూ.1,200 కోట్లతో కృష్ణా కెనాల్-గుంటూరు మధ్య ఈ లైన్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్న రెండు లైన్లపై రద్దీ తగ్గించి, రైళ్ల రాకపోకలను వేగవంతం చేయడమే లక్ష్యం. అంతేకాకుండా గూడూరు-విజయవాడ మూడో లైన్ను విజయవాడ వరకు పొడిగించాలని కోరుతున్నారు.