Andhra Pradesh High Court On Lulu Mall Land: ఏపీలో లులు మాల్స్ ఏర్పాటుపై హైకోర్టులో రగడ మొదలైంది. విజయవాడలో ఆర్టీసీ భూమి కేటాయింపుపై మాజీమంత్రి పిల్ దాఖలు చేయడంతో అసలు కథ మొదలైంది. బిడ్డింగ్ లేకుండానే భూమి ఇచ్చారని పిల్లో పేర్కొనగా, హైకోర్టు ప్రభుత్వం, ఆర్టీసీ, లులు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పాత పాలసీకి విరుద్ధంగా భూములు కేటాయించారని వాదనలు వినిపిస్తున్నాయి. మరి హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి.