ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రజలు అందరికీ ఆరోగ్య బీమా అందించాలనే ఉద్దేశంతో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు ఏపీ కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం అందిస్తారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సంజీవని పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. సంజీవని పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు లబ్ధి కలుగుతుందన్నారు.