ఏపీలో మరో ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. విశాఖలో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం పునఃప్రారంభమైంది. 16.90 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియంలో ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తికావటంతో మంగళవారం రోజున పునః ప్రారంభించారు. ఆధునికీకరణ పనులలో భాగంగా సీటింగ్ సామర్థ్యం పెంపు, సెంట్రల్ ఏసీ, సీసీ కెమెరాల వ్యవస్థ, బ్యాడ్మింటన్ కోర్టులు వంటివి ఏర్పాటు చేశారు.